రామాయణం

భగీరథోపి రాజర్షిదివ్యం స్యందనమాస్థితః
ప్రాయాదగ్రే మహాతేజా గఙ్గా తం పృష్టతో న్వగాత్

దేవాః సర్షిగణాః సర్వే దైత్య దానవ రాక్షసాః
గంధర్వ యక్ష ప్రవరాః సకిన్నరమహోరగాః

సర్వాశ్చాప్సరసో రామ భగీరథరథానుగాం
గఙ్గామన్వగమన్ ంప్రీతాః సర్వే జలచరాశ్చ యే

యతో భగీరథో రాజా తతో గఙ్గా యశస్వినీ
జగామ సరితాం శ్రేష్ఠా సర్వపాప ప్రణాశినీ

భగీరథుడు దివ్యమైన  రథాన్నెక్కి బయలు దేరాడు . అతనిననుసరించింది శివజటాజుటాన్నుండి జాలువారిన గంగమ్మ . జలాలతోబాటు జలచరాలు అమ్మవడిలో ఈదులాడుతూ కదిలాయి . పావనమైన గంగతో బాటు ఋషులు , దేవతలు , యక్ష ,కిన్నర , కింపురుషులూ , అప్సరసలూ ప్రయాణం చేసారు . సాగరం వైపు భగీరథుడు ప్రయాణిస్తుంటే యశస్వినీ , జలాలలో పుణ్యప్రదమైనదీ , సర్వపాప వినాశినీ అయిన గంగ ఒయ్యారంగా ఆ మహర్షిని అనుసరించి వెళ్ళింది . ఉత్సాహంతో ఉరవడిగా , ఉరుకులు పరుగులతో సాగిపోయింది గంగ .
ఆలోచన :

గజేంద్రమోక్షంలో శ్రీహరిననుసరించి లక్ష్మి , శంఖ ,చక్రాది అయుధాలు , గరుత్మంతుడు వెళ్ళే సందర్భం స్మరణకు రావడం లేదూ .
భాగవతంలోని ఆ పద్యం :
తనవెంటన్ సిరి , లచ్చివెంట నవరోధవ్రాతమున్ , దాని వెన్
కను బక్షీంద్రుడు వానిపొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును , నారదుండు , ధ్వజినీ కాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునన్ గలుగువారాబాల గోపాలమున్

పుణ్యుల వెంట ప్రయాణించడం మనకు అనాదిగా వస్తున్న సంస్కృతి . మహాత్ముల బాటలో ప్రయాణం చేసేవారికి పుణ్యాలను లభిస్తాయి . సన్మార్గం అవగతమౌతుంది .

DSC04469

Post a comment or leave a trackback: Trackback URL.

వ్యాఖ్యానించండి