ఏష దేశస్స కాకుత్థ్స మహేంద్రాధ్యుషితః పురా
దితిం యత్ర తపః సిద్ధామేవం పరిచచార సః
ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః
అలంబుసాయాముత్పన్నో విశాల ఇతి విశ్రుతః
విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలః
సుచంద్ర ఇతి విఖ్యాతః హేమచంద్రాదనంతరః
సుచంద్ర తనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః
ధూమ్రాశ్వ తనయశ్చాపి సృంజయః సమపద్యత
సృంజయస్య సుతః శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్
కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః
కుశాశ్వస్య మహాతేజా సొమదత్తః ప్రతాపవాన్
సోమదత్తస్య పుత్రస్తు కాకుత్థ్స ఇతి విశ్రుతః
తస్య పుత్రో మహాతేజాః సంప్రత్యేష పురీమిమాం
అవసత్య అమరప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః
శ్రీరామా ! అసురమాతయైన దితి తపస్సు చేసే సమయంలో దేవేంద్రుడు ఆ మాతకు సేవలు చేసిన స్థల మిదే .ఈ ప్రదేశంలోనే ఇక్ష్వాకు మహారాజుకు అలంబస అనే స్త్రీ ద్వారా విశాలుడుగా ప్రసిధ్ధి కెక్కిన తనయుడు జన్మించాడు . ఆత్డు విశాలపురమనే నగరాన్ని నిర్మించినదీ ప్రదేశంలోనే .
విశాలుని కుమారుడు హేమచంద్రుడు , అతని కుమారుడు సుచంద్రుడు . సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుదు , మనుమడు సృంజయుడు . సృంజయుని కొడుకు సహదేవుడు . ధార్మికుడైన కుశాశ్వుడు సృంజయుని కుమారుడు . కుశాశ్వునకు సోమదత్తుడు , ఆతనికి కాకుత్థ్సుడు జనించారు .
కాకుత్థ్సుని పుత్రుడు సుమతి . దేవతలకు దీటైనవాదు , దుర్జయుడు అయిన సుమతి ప్రస్తుతం ఈ నగరానికి రాజు .
Note :
ప్రస్తుతం విశాల నగరం బీహార్ రాష్ట్రంలో వైశాలి అనే పేరుతో విరాజిల్లుతున్నది . బౌధ్ధులకూ , జైనులకూ ఈ ప్రదేసం పుణ్యక్షేత్రం . జైన మత స్థాపకుడు మహావీరుడు జన్మించిన స్థలమిదేనని శ్వేతాంబర జైనులు చెబుతారు .
తన శిష్యుడైన ఆనందుని కోరిక ప్రకారం బుధ్ధుడు స్త్రీ బౌధ్ధబిక్షువులను సంఘంలోకి మొట్టమొదటగా అనుమంతించిన ప్రదేశమిదే .
ఆరవ శతాబ్దిలో లిచ్ఛవీ రాజుల రాజధానిగా వర్ధిల్లిన ప్రదేశమిది .