ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునిః
సాధు సాధ్వితి తం సర్వే మునయోహ్యభ్యపూజయన్
కుశికానామయం వంశో మహాన్ ధర్మపరస్సదా
బ్రహ్మోపమా మహాత్మనః కుశవంశ్యా నరోత్తమాః
విశేషేణ భవానేన విశ్వామిత్ర మహాయశః
కౌశికీ సరితాం శ్రేస్ఫ్ఠా కులోద్ద్యోతకరీ తవ
శ్రీరామచంద్రునికి కుశవంశ వృత్తాంతం చెప్పాడు మహర్షి . తన కథా , స శరీరంగా స్వర్గానికి వెళ్ళిన సోదరి కౌశికీ నది కథా అందంగా చెబితే విన్న రామలక్ష్మణులూ , మునులూ ” సాధు , సాధని ( బాగు , బాగని )” మెచ్చుకున్నారు . కుశవంశం పూజ్యమైనది , కుశవంశానికి చెందిన వారు నరులలో ఉత్తములు , మహాత్ములు , బ్రహ్మదేవునితో సమానమైన వారు . నిజంగా చెప్పాలంటే కుశవంశంలో జన్మించిన వారందిలో తమరు మహాత్ములు , బ్రహ్మతుల్యులు . తమ సహోదరి కౌశికి మీ కులాన్ని ప్రకాశింపజేసింది .
ఇతి తైర్ముని శర్దూలైః ప్రసస్తః కుసికాత్మజః
నిద్రముపాగమచ్ఛ్రీమాన్ శ్రీమానస్తమివాంసుమాన్
రామోపి సహసౌమిత్రిః కించిదాగయవిస్మయః
ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే
మునులు ఆవిధంగా పొగుడుతూ ఉండగానే , బ్రహ్మవర్ఛస్సుతో వెలుగిపోతున్న విశ్వామిత్ర మహర్షి , సూర్యభగవానుడు అస్త్రాద్రిని చేరిన విధంగా నిద్రాదేవతను వరించాడు ( నిద్రపోయాడు ) . మహర్షి కమనీయ గాధను విన్న రామలక్ష్మణులు కొంత సమయం విస్మయం చెంది , పిదప నిద్రపోయారు .
ముప్పది నాలుగవ సర్గ సమాప్తం
వివరణ :
విశ్వనాథ సత్యనారాయణ గారు తమ కల్ప వృక్షంలో ఈ సందర్భంలో చెప్పిన పద్యం
చిన్నకథ జెప్పి నీకు , నీ చేత నొక్క
యే మహాకార్యమేను జేయింతు నింత
యల్ప సంతోషివేమె రామాయటంచు
నవ్వె ఋషి , యెల్ల ఋషులును నవ్వినారు .
” చిన్న చిన్న కథలను చెప్పి , విశ్వామిత్ర మహర్షి , రామునిచే ఘనమైన కార్యాలను చేయిస్తాను ” అని సరదాగా , హాస్యముట్టిపడేవిధంగా చెప్పారు . నిజానికి మంచి మాటలతో మనుష్యులనూ , వారి మనసులను వశపరచుకొని , అద్భుతాలను సాధింపవచ్చు అన్నది నాయకులందరికీ తెలిసిన రహస్యం , విజయపథంలో పయనించడానికి మనమలవరచుకోవలసిన విద్య . రామాయణంలో మంచిమాటలతో పనులు సాధించిన సందర్భాలు కోకొల్లలు .
river Koshi
( photo taken from http://gkamesh.wordpress.com/tag/koshi )