అభిపూజ్య తతో హృష్ఠాః సర్వే చక్రుర్యథావిధి
ప్రాతః సవన పూర్వాణి కర్మాణి మునిపుంగవాః
యాగం ప్రారంభమయింది . యజ్ఞంలో భాగాలైన ప్రాతః సవనము మొదలగు కార్యాలను విధిపూర్వకంగా నిర్వర్తించారు సంతుష్టాంతరంగులైన మునిపుంగవులు . పిదప ఆహూతులైన దేవతలను ఆరాధించారు .
17.288696
78.604046
ఋశ్యశృంగం పురస్కృత్య కర్మ చక్రుర్ద్విజర్షభాః
అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞోస్య సుమహాత్మనః
కర్మ కుర్వంతి విధివద్యాజకా వేదపారగాః
యథావిధి యథాన్యాయం పరిక్రామంతి శాస్త్రతః
బ్రాహ్మణులు యాగాన్ని ఆరంభించారు . ఋశ్యశృంగుడు మార్గదర్శకత్వం వహించగా చేయవలసిన కార్యాలన్నీ యథావిధిగా , తప్పులు లేకుండా చేసారు ద్విజపుంగవులు . వేదమార్గం , శాస్త్రమార్గం ,న్యాయమార్గాలను పాటిస్తూ యాగాన్ని చేసారు .
ప్రవర్గ్యం శాస్త్రతః కుర్వా తథై వోపసదం ద్విజాః
చక్రుశ్చ విధివత్సర్వమధికం కర్మ శాస్త్రతః
అశ్వమేధానికి అంగాలయిన ప్రవర్గ్యము , ఉపసదము అనే కర్మలను ద్విజులు శాస్త్రపరకారం నిర్వర్తించారు .
అశ్వమేధ యాగాన్ని ప్రారంభించడానికి ముందు చేసే కర్మ ప్రవర్గ్యం . అశ్వనీ దేవతలకు ఆవు పాలను ఆరగింపుగా ఇవ్వడమే ఈ కర్మలోని ప్రధానాంశం . ఇది రెండువిధాలుగా ఉంటుంది . పాలను ఆరగింపు చేయడానికి ఉపయోగించే మృణ్మయ పాత్రలనూ ఇతరపరికరాలనూ నిర్మించే విధానం మొదటిది . ఈ పాత్రలను ఘర్మ లేక మహావీర అని అంటారు . మృణ్మయ పాత్రలను అగ్నిలో కాల్చి నిర్మించిన వెంటనే వేడిపాత్రలలో ఆవుపాలను అశ్వనీ దేవతలకు ఆరగింపు చేస్తారు . ఈ తంతు ప్రతి ఉదయమూ , సాయంత్రమూ , మూడురోజుల పర్యంతం ఉపసదమనే కర్మ చేయడానికి ముందు చేస్తారు . యజ్ఞం సమాప్తి కాగానే మహావీర పాత్రను ఒక ఉరేగింపుగా ఉత్తరవేదిక వద్దకు తీసుకొని వెళ్ళి భూస్తాపితం చేస్తారు . ప్రవర్గ్య కర్మను శాస్త్రీయంగా చేస్తే యజమాని మార్తాండునిలాగా వెలిగిపోతాడనీ , అత్యంత శక్తివంతుడౌతాడనీ నమ్మకం .
ప్రవర్గ్యం పిదప చేసే కర్మ ఉపసదం . ఉపసదంలో అగ్నికీ , సోముడికీ చివరగా మహావిష్ణువుకూ నేతితో ఆహుతులిస్తారు . శతపథ బ్రాహ్మణంలో ఉపసదానికి సంబంధించిన కర్మకాండను వివరంగా తెలిపారు .
17.288696
78.604046
పదమూడు సర్గలు సమాప్తమయ్యాయి . పదునాలుగవ సర్గలో అశ్వమేధ యాగం చేసిన విధానాన్ని వివరిస్తారు వాల్మీకి మహర్షి .
అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే
సరయ్వాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత
సంవత్సరకాలం పూర్తి అయింది . జైత్ర యాత్ర ముగించుకొని తురగం తిరిగి వచ్చింది . పవిత్రమైన సరయూ నదీ తీరంలో పావనులైన మహర్షులు అశ్వమేధ యజ్ఞాన్ని ప్రారంభించారు .
17.288696
78.604046
సర్వకామైరుపహృతైరుపేపేతం వై సమంతతః
ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితం
తథా వసిష్ఠ వచనాదృశ్యశృంగస్య చోభయోః
శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతిః
తతో వసిష్ఠప్రముఖాస్సర్వ ఏవ ద్విజోత్తమాః
ఋశ్యశృంగం పురస్కృత్య యజ్ఞ కర్మారభంస్తదా
యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి .
దశరథ మహారాజు శుభ నక్షత్రం కూడిన శుభ దినాన యాగశాలకు బయలుదేరాడు .
వసిష్ఠ మహర్షి దశరథునితో ” రాజా కామ్యాలైన అన్ని వస్తువులతో నిండిఉన్న ఈ యజ్ఞశాలను దర్శించండి . మనసు ఊహించిన విధంగా , ఏ కొరతా లేకుండా , అత్యద్భుతంగా నిర్మించబడిన యాగశాల ఇది ” అని పలికాడు . ఋష్యశృంగ మహర్షి కూడా యజ్ఞానికి చేసిన ఏర్పాత్లతో సంతుష్టుడై వసిష్ఠ మహర్షి భావాలనే మహారాజుతో తిరిగి వ్యక్తం చేసాడు .
ఋషులు , బ్రాహ్మణులు వసిష్ఠుడు , ఋష్యశృంగ మహర్షిని ప్రధాన కర్తగా చేసి శాస్త్ర ప్రకారం యజ్ఞాన్ని ప్రారంభించారు .
రామాయణ కాలం నుండీ , ఏదైనా పని ప్రారంభించే ముందు మంచి ముహూర్తం చూసి పనిని మొదలు పెట్టడం శుభమని తలచే వారు . మంచిముహూర్తంలో మొదలు పెట్టిన పని సఫలీకృతం కావడం , ఈ రోజున కూడా చాలామందికి అనుభవైకవేద్యం .
17.288696
78.604046
తతః కైశ్చిదహోరాత్రైరుపయాతా మహీక్షితః
బహూని రత్నన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై
తతో వసిష్ఠః సుప్రీతో రాజానమిదమబ్రవీత్
ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్
మయాపి సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః
యజ్ఞీయం చ కృతం రాజన్ పురుషైః సుసమాహితైః
నిర్యాతు చ భవాన్యష్టుం యజ్ఞాయతనమంతికాత్
అహ్వానితులైన రాజులందరూ యజ్ఞాన్ని వీక్షించే కోరికతో అయోధ్యానగరానికి విచ్చేసారు . దశరథునికి బహుమానంగా ఇవ్వడానికి అత్యుత్తమమైన రత్నాలను తమతో తీసుకొని వచ్చారు .
భగవంతుని వద్దకూ , పెద్దలైన వారి వద్దకూ , చిన్నపిల్లల వద్దకూ , రాజు వద్దకూ వట్టి చేతులతో వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు .
వసిష్ఠ మహర్షి , దశరథునితో ” రాజసత్తమా నీ ఆజ్ఞ ప్రకారం రాజులందరూ వచ్చారు . వారినందరినీ యథారీతిగా నేను సత్కరించాను” .
“ఇక యజ్ఞానికి కావలసిన అన్ని పదార్థాలను సమకూర్చడమైనది . నీవు యజ్ఞశాలకు బయలుదేరాలి ” అని పలికాడు .
17.288696
78.604046
తతః ప్రీతో ద్విజశ్రేష్ఠస్తాన్ సర్వానిదమబ్రవీత్
అవజ్ఞ యా న దాతవ్యం కస్య చిల్లీలయాపివా
అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః
యజ్ఞం నిర్వహించడానికి చేయవలసిన పనులు సక్రమంగా జరుగుతున్నాయని తెలుసుకొన్న వసిష్ఠ మహర్షి ప్రీతి చెందినవాడై పనులు చేసే వారితో ఈ విధంగా పలికాడు : “సేవ చేసే సమయంలో మీరు జాగర్తగా ఉండాలి . ఏదైనా వస్తువు అహ్వానితులకు ఇచ్చే సమయంలో ఆదరంగా ఇవ్వాలి . అనాదరంగా కాని అశ్రధ్ధగా కాని ఇవ్వకూడదు . అనాదరంతో ఉచ్చిన దానం , దాత వినాశనానికి కారణమవుతుంది” .
భారతీయ సంస్కృతిలో ఇతరులను ఆదరించడం , అతిథులను గౌరవించడం అతి ముఖ్యమైనది . అతిథిని విష్ణుదేవునితో సమానంగా చూడటం మన పధ్ధతి .
దానమిచ్చేవాడికి పుచ్చుకునేవాడు లోకువ . ఇది లోక సహజం . కానీ భారతీయ ధర్మానికిది విరుధ్ధం . దానగ్రహీతను సంతోషంగా ఉండేటట్టు చూడడం భారతీయులు పరమధర్మంగా భావిస్తారు . అందుకే ఏదైనా ఇచ్చేటప్పుడు ఎదుటివారి మనసును నొప్పించకుండా ఉండతానికి తగు జాగర్త తీసుకుంటారు . దానగ్రహీతకు అసంతృప్తి కలిగితే అది పాపమై తమనుచుట్టుకుంటుందనీ , తమ వినాశనానికి దారి తీస్తుందనీ నమ్ముతారు . అదే భావాన్ని వసిష్ఠ మహర్షి ఈ శ్లోకంలో వ్యక్తపరిచారు .
17.288696
78.604046
స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్
సుమంత్రస్త్వరితో భూత్వా సమానేతుం మహీక్షితః
సుమంత్రుడు జనకుడు , కేకయ మహారాజు వంటి అతిముఖ్యమైనవారిని అహ్వానించడానికి స్వయంగా బయలు దేరాడు .
బుధజన విధేయుడు , మహాభాగధేయుడు , సుగుణమణిగణ వరిష్ఠుడు , వినయవివేక భూషణుడు , పరమభాగవత శ్రేష్ఠుడు గా సుమంత్రుని తీర్చిదిద్దాడు వాల్మీకి మహర్షి . ఇటువంటి మంత్రి దొరకడం దశరథుని అదృష్టం .
తే చ కర్మాంతికాస్సర్వే వసిష్ఠాయ చ ధీమతే
సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యదుపకల్పితం
వసిష్ఠ మహర్షి వద్ద యజ్ఞవిధులలో నియుక్తులైన వ్యక్తులు , తాము చేసిన పనుల వివరాలను మహర్షికి నివేదించారు .
17.288696
78.604046
సంతి స్నిగ్ధాశ్చ యే చాన్యే రాజానః పృథివీతలే
తానానయ యథాక్షిప్రం సామగాన్ సహబాంధవాన్
ముఖ్యమైన అహ్వానితుల పేర్లు చెప్పాక వసిష్థ మహర్షి ” అయోధ్యా నగరానికి స్నేహితులైన రాజులు , చక్రవర్తులందరినీ అనుచర సహితంగా అహ్వానించమని ” సుమంత్రుణ్ణి కోరాడు .
వసిష్ఠ వాక్యం తచ్ఛృత్వా సుమంతృస్త్వరితస్తదా
వ్యాదిశత్పురుషాంస్తత్ర రాజ్ఞామానయనే శుభాన్
వసిష్ఠ మహర్షి మాటలు శ్రధ్ధతో ఆలకించిన సుమంత్రుడు , రాజులను ఆహ్వానించి వెంట తీసుకొని రావడానికి ఉత్తములైన , సద్గుణవంతులైన పురుషులను పంపాడు .
17.288696
78.604046
అఙ్గేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతతం
వయస్యం రాజసిం హస్య సమానయ యశస్వినం .
ప్రాచీనాన్ సింధువీరాన్ సౌరష్ట్రేయాంశ్చ పార్థివాన్
దాక్షిణాత్యాన్నరేంద్రాం శ్చ సమస్తానానయస్వ హ
అంగదేశాధిపతి రోమపాదుడు దశరథ మహారాజుకు మంచి మిత్రుడు . ఆ భాగ్యశాలిని చక్కగా సత్కరించి తీసుకొని రావాలి . అదేవిధంగా సింధు , సౌవీర ,సౌరాష్ట్ర , దాక్షిణ్య దేశాల రాజులందరినీ అహ్వానించి అశ్వమేధ యాగాన్ని తిలకించడానికి తీసుకొని రావాలి .
17.288696
78.604046
తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం
వయస్యం రాజసిం హస్య స్వయమేవానయస్వ హ
తథా కేకయరాజానం వృధ్ధం పరమధార్మికం
శ్వశురం రాజసిం హస్య సపుత్రం త్వమిహానయ .
మహారాజు కు మిత్రుడైన కాశీపతి స్నేహశీలుడు , ఎల్లప్పుడూ ప్రియంగా పలికేవాడు .
మహారాజు మామ గారైన కేకయ రాజు వృధ్ధుడు , పరమధార్మికుడు .
నీవు స్వయంగా వెళ్ళి ప్రేమపూర్వకంగా వీరిని పిలచి , వెంట తీసుకొని రావాలి .
17.288696
78.604046