తమువాచ హరిః ప్రీతః కాశ్యపం ధూత కల్మషం
వరం వరయ భద్రం తే వరార్హోసి మతో మమ
తచ్ఛ్రుత్వా వచనం తస్య మారీచః కాశ్యపో బ్రవీత్
ఆదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః
వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత
పుత్రత్వం గచ్ఛ భగవన్నదిత్యా మమ చానఘ
భ్రాతా భవ యనీయాంస్త్వం శక్రస్యాసురసూదన
శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి .
కశ్యప మహర్షిని కరుణించిన కమలనాభుడు ” “వరమిస్తాను , నీకేం కావాలో కోరుకో ” అని అన్నాడు . ప్రభూ ! నాకూ, అదితికీ , దేవతలకందరికీ ఉన్నది ఒకటే కోరిక . నీవు నా పుత్రుడుగా జనించి శోకంతో ఉన్న దేవతల కష్టాలు తీర్చు ” అని తన మనసులోని కోరికను పరమ పావనుడైన పరమాత్మునికి నివేదించాడు కశ్యపుడు .
వామనమూర్తి కథ భాగవతంలో కొంత వేరుగా ఉంది . కశ్యపమహర్షి అదితికి పయోభక్షణమనే వ్రతాన్ని ఉపదేశిస్తాడనిన్నీ , ఫాల్గుణమాస శుక్లపక్షంలో ప్రథమ దినాన వ్రతాన్ని మొదలు పెట్టిన అదితికి ద్వాదశి నాడు నారాయణుడు ప్రత్యక్షమయి , తను కుమారునిగా పుడతానని వరమిస్తాడని ఉంది . వరాన్ని పొందిన అదితి
కన్నుల సంతోష్రాశులు , చన్నులపై బఱవ బులక జాలము లెసగన్
సన్నతులును సన్నుతులును , నున్నత రుచి జేసి నిటల యుక్తాంజలియై
చూపుల శ్రీపతి రూపము , నాపోవక త్రావి త్రావి హర్షోధ్ధతయై
వాపుచ్చి మంద మధురాలాపంబుల బొగడె నదితి లక్ష్మీ నాథున్
అని ఆనందపారవశ్యంతో పరమాత్మను ప్రశంసిస్తుంది .