తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిం
ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం
ధర్మిష్ఠం చ యశస్యం చ వచనం సత్యవాదినః
శ్రుత్వా విదేహాధిపతిః పరం విస్మయమాగతః
కుమారుని వివాహాన్ని చేయించమని జనకుడు కోరాడు కదా ! దానికి ప్రత్యుత్తరంగా ఋషుల సమక్షంలో, జనక మహారాజుతో ,దశరథ మహారాజు ” ధర్మజ్ఞా ! ప్రతిగ్రహో దాతృవశః , అంటే ఇవ్వడమనేది దాత చేతిలో ఉంటుంది అని పూర్వం విని ఉన్నాను . దాత ఇచ్చినప్పుడే ప్రతిగ్రహీత తీసుకుంటాడు . తమరు కన్యాదానం చేయడానికి నిర్ణయించారన్న విషయాన్ని విన్నాను . తమరు దాత . తమరు ఏ విధంగా చెబుతారో నేను ఆవిధంగా చేస్తాను ” అని మధురంగా పలికాడు . ఎల్లప్పుడూ సత్యమే పలికే దశరథుని నోటినుండి వెడలి ధర్మంతో కూడి , యశస్సును చేకూర్చే మాటలనువిన్న జనకుడు ఆశ్చర్య పడ్డాడు .
విశేషం : ప్రస్తుతం వరుని తలిదండ్రులు , బంధువులు వ్యవహరించే విధానం , గొంతెమ్మ కోర్కెలు కోరడం మనకు తెలుసు . వధువు తండ్రిని ఇక్కట్ల పాలు చేయడం సాధారణం . కానీ ఇది మన సంస్కృతి కాదు . వివాహం వధువు తండ్రికి నచ్చిన / సాధ్యమైన రీతిగానే జరిగేది , జరగాలి కూడా . వధువు తండ్రితో ఏ విధంగా మర్యాదా పూర్వకంగా మాట్లడాలో రామాయణం తెలియజేస్తుంది .
తతః సర్వే మునిగణాః పరస్పర సమాగమే
హర్షేణ మహతా యుక్తాస్తాం నిశామవసన్ సుఖం
రాజా చ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షితః
ఉవాస పరమప్రీతో జనకేన సుపూజితః
జనకోపి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త్వవిత్
యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాస హ
రామ లక్ష్మణులను చూసి పరమానంద భరితుడయ్యాడు దశరథుడు . జనకుని సత్కారాలాను స్వీకరించి సంతోషించిన దశరథ మహారాజు రాత్రి తన నివాసంలో సుఖంగా గడిపాడు .
ధర్మతత్త్వాలను తెలిసిన జనక మహారాజు యజ్ఞ సంబంధ మైన కర్మలను , ఇతర క్రియలను చేసి ఆ రాత్రి గడిపాడు .
విశేషం : వివాహాది శుభకార్యాలు గణపతి పూజతో ఆరంభ మవుతాయి , వైష్ణవులైతే విష్వక్సేనారాధనతో శుభ కార్యాలను ప్రారంభిస్తారు .
1 . గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవస్తమం , జ్యేష్ఠ రాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశ్శృ ణ్వన్నూతి భి స్సీదసాదనం ”
2 .దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి ! సా నో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు ”
3 . వివాహం జరిపించడానికి ముందు స్నానం చేసి , ధౌత వల్కలాలను ధరించి ,దర్భలను గ్రహించిన పవిత్ర పాణితో (చేతితో ) ఆచమనం చేసితలపెట్టిన కార్యాన్ని ప్రారంభించడానికి ” నమస్సదసే , నమస్సదసస్పతయే — ” అంటూ భాగవతోత్తముల అనుజ్ఞను పొందుతాడు కర్త . “సర్వేభ్యః శ్రీ –నమః “అని నమస్కారం చేసి , పృకృత కర్మారంభ ముహూర్త స్సుముహూర్తో స్త్వితి భవంతో మహాంతో అనుగృహ్ణంతు ” ( ప్రస్తుతం కర్మను ప్రారంభించిన ముహూర్తం సుముహూర్తమని మహానుభావులైన తమరు అనుగ్రహించుదురుగాక “”లగ్నస్య సర్వే గ్రహాః ఏకాదశ స్థాన ఫలదాః సుప్రసన్నా భూయాసురితి భవంతో మహాంతో అనుగ్రహ్ణంతు ” — ” ఈ లగ్నంలో ఉన్న గ్రహాలన్నీ మనం చేసుకుంటున్న శుభకర్మకు అనుకూలించుగాక ” అని పలికి దర్భాసనం మీద ధర్మ పత్నితో కూర్చొని విష్వక్సేన పూజకు ఉపక్రమిస్తాడు కన్యా దాత .
3 . శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! అస్య శ్రీ భగవతో మహాపురుషస్య , శ్రీ మహావిష్ణోరాజ్ఞ్యయా , ప్రవర్తమానస్య , అద్యబ్రహ్మణః,ద్వితీయ పరార్థే , శ్రీ శ్వేత వరాహ కల్పే , వైవస్వత మన్వంతరే ,
కలియుగే , ప్రథమ పాదే , జంబూ ద్వీపే , భరతవర్షే , భరత ఖండే ,శకాబ్దే , మేరోః దక్షిణ దిగ్భాగే , శ్రీరంగస్యోత్తర దేశే గంగా కావేర్యోః మధ్య దేశే , అస్మిన్ వర్తమాన చాంద్ర మానేన , ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే , –సంవత్సరే , –ఆయనే — , ఋతౌ — , మాసే –, పక్షే — , తిథౌ — , వారే —, నక్షత్రే — , శుభయోగే , శుభకరణే , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం , శుభతిథౌ , శ్రీ భగవదాజ్ఞ్యయా , భగవత్ కైంకర్య రూపం , కరిష్యమాణస్య , పృకృతకర్మణః అవిఘ్నేన పరిసమాప్యర్థం , ఋధ్యర్థం అదౌ శ్రీ విష్వక్సేన పూజాం కరిష్యామి .
అని సంకల్పించి తలపెట్టిన కార్యాన్ని ప్రారంభిస్తాడు కర్త .