తతః సుమంత్రస్త్వరితం గత్వా త్వరిత విక్రమః
సమానయత్స తాన్ సర్వాన్ సమస్తాన్వేదపారగాన్
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపం
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమా ః
దశరథుని ఆజ్ఞ ప్రకారం — సుయజ్ఞ , వామదేవ , జాబాల , కాశ్యప మహర్షులనూ — కులగురువూ, పురోహితుడైన వసిష్ఠునీ — వేదపారంగతులైన ఇతర ద్విజోత్తములనూ , సవినయంగా అహ్వానించి తన వెంట తీసుకొని వచ్చాడు సుమంత్రుడు .
తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా
ఇదం ధర్మార్థసహితం శ్లక్ష్ణం వచన మబ్రవీత్
మహాత్ములైన మహర్షులను సాదరంగా ఆహ్వానించి పూజించాడు మహారాజు . తన మనసులోని భావాన్ని మధురంగా , తియ్యనైన మాటలలో వారికి వివరించాడు.
17.288696
78.604046
స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుధ్ధిమాన్
మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః
తతో బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రిసత్తమం
శీఘ్రమావయ మే సర్వాన్ గురూంస్తాన్ స పురోహితాన్ .
ఒక నిర్ణయానికి వచ్చాక ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం విజ్ఞుల లక్షణం . పెద్దలైన గురువులనూ , పురోహితులనూ తన దగ్గరకు తీసుకొని రమ్మని అమాత్య సుమంత్రుని అదేశించాడు దశరథమహారాజు .
17.288696
78.604046
చింతయానస్య తస్యైవం బుధ్ఢి రాసీన్మహాత్మనః
సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహం
సంతానమే లేక సౌఖ్యమే లేదని తలచిన దశరథ మహారాజు సంతానం పొందడానికి ఏమి చెయ్యాలా అని అలోచించాడు . అశ్వమేధ యాగం చేస్తే పుత్రుడు జనిస్తాడని అనుకొన్నాడు . సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారమార్గాలనాలోచించి సమస్యలను తొలగించుకొనేవాడే విజ్ఞుడు కదా . సంతానం పొందడానికి దశరథునికి తట్టిన మొట్ట మొదటి అలోచన ఇది .”ఫస్ట్ థాట్ ఈస్ ది బెస్ట్ థాట్” అని తలచిన దశరథమహారాజు అశ్వమేధయాగాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాడు . ఈ విధంగా నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ” ఇంట్యూటివ్ డెసిషన్ మేకింగ్ ” అని అనవచ్చు .
17.288696
78.604046
అష్టమ సర్గ
తస్య త్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః
సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరః సుతః
ప్రపంచంలో అన్ని సుఖాలకంటే పుత్రగాత్ర పరిష్వంగం ఉత్తమమైనది అని పెద్దల ఉవాచ . ఆ కౌగిలి చల్లదనాన్ని ముక్తాహారాలూ , మంచిగంధపు పూతలూ , పరాగ ప్రవరమూ (పరాగమంటే పుప్పొడి ), చంద్రుని వెన్నెలా ఇవ్వలేవని అంటుంది శకుంతల (తెలుగు మహాభారతం ). “మహోదధేః పూర ఇవేందు దర్శనా” పూర్ణ చంద్రుని చూచినప్పుడు ఉప్పొంగే సముద్రుని వలె పుత్రుని చూసి జననంతో తండ్రి ఉప్పొంగుతాడు . ఒక దీపాన్నుండి ఇంకో దీపం పుట్టినట్లుగా పుత్రుడు ఉదయిస్తాడు . ఇంకా వివరంగా చెప్పాలంటే జనకుడే తనదైన ప్రకాశంతో పుత్రుడై వర్ధిల్లుతాడు . తన రూపాన్ని చూసి తనే మురిసినట్టు , పుత్రుని చూసిన తండ్రి మహదానంద భరితుడౌతాడు . పున్నామ నరకం నుండీ తప్పించుకుంటాడు .
దశరథునికి ఆ సుఖం కరువైంది . ప్రభావం కలవాడూ , ప్రతిభావంతుడూ అయిన దశరథునకు ముగ్గురు భార్యలున్నా సంతానం కలుగలేదు .
17.288696
78.604046
రాజ్యాన్ని సురాజ్యం చేయాలంటే , రాజ్యంలోని ప్రజలందరికీ శాంతి సౌఖ్యాలందించాలంటే ధర్మపరిపాలన అవసరం . ధర్మపరిపాలననందించడం రాజ్యం చేసేవాడి ప్రథమ కర్తవ్యం . ఈ కర్తవ్య నిర్వహణలో దశరథుడికి తోడ్పడడానికి ఎనిమిది మంది అమాత్యులు ఉండేవారు . వారి పేర్లు వరుసగా
ధృష్టి , జయంతుడు , విజయుడు , సిధ్ధార్థుడు , అర్థసాధకుడు , అశోకుడు , మంత్రపాలుడు , సుమంత్రుడు .
ధృష్టిర్జయంతో విజయః సిధ్ధార్థోహ్యర్థసాధకః
అశోకో మంత్రపాలశ్చ సుమంత్ర శ్చాష్టమో భవత్
ఏడవ సర్గలో ఈ ఎనిమిది మంత్రుల సామర్థ్యాన్నీ , గుణగణాలనూ , రాజభక్తినీ , దేశభక్తినీ బహు చక్కగా వర్ణించాడు వాల్మీకి మహర్షి .
ఈ మంత్రులందరూ సార్థక నామధేయులు .
ధృష్టి అంటే దూర దృష్టి కలవాడనీ , కార్యసాధకుడనీ అర్థాలు గోచరిస్తాయి . జయ విజయులు పరాక్రమవంతులు , యుధ్ధంలో ఓటమినెరుగని వారు . సిధ్ధార్థుడు , అర్థసాధకుడు తలపెట్టిన పనిని పరిపూర్తి గావించేవారు , అశోకునికి దుఃఖమంటే తెలియదు , మంత్రపాలుడు రహస్యాలను దాచి ఉంచగలిగే శక్తి గలవాడు , సుమంత్రుడు ఉత్తమమైన , రాజ్యాపాలనకు అవశ్యకమైన అలోచనలకు నిధి .
17.288696
78.604046
నాధ్యగచ్ఛద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః
మిత్రవాన్నతసామంతః ప్రతాపహతకణ్టకః
స శశా స జగద్రాజా దివం దేవపతిర్యథా
తైర్మంత్రిభిః మంత్రహితే నివిష్టైః
వృతో నురక్తైః కుశలైః సమర్థైః
స పార్థివో దీప్తిమవాప యుక్త
స్తేజోమయై ర్గోభిరివోదితోర్కః
భూమండలాన్ని పరిపాలించే రాజులందరూ దశరథుని మిత్రులే . నతమస్తకులైన సామంతులు తనను సేవిస్తూ ఉండగా , శత్రునిష్కంటకంగా , దేవేంద్రుడు స్వర్గాన్ని పాలించినట్లు అయోధ్యను పరిపాలిస్తూ , తేజోవంతుడైన ఉదయభానుని లాగా ప్రకాశించాడు దశరథ మహారాజు .
17.288696
78.604046
ఈదృశైస్తైరమాత్యైస్తు రాజా దశరథోనఘః
ఉపపన్నో గుణోపేతై రన్వశాసద్వసుంధరాం
అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రఞ్జయన్
ప్రజానాం పాలనం కుర్వన్ అధర్మాన్ పరివర్జయన్
విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః
స తత్ర పురుష వ్యాఘ్రః శశాస పృథివీమిమాం
మహనీయులైన మంత్రులు అండగా ఉండగా , దశరథునకు ధర్మపరిపాలనం నల్లేరుమీద నడకైంది .గూఢచారుల ద్వారా ప్రతి చిన్న విషయాన్నీ చక్కగా తెలుసుకొంటూ ప్రజల సంతోషమే ధ్యేయంగా పరిపాలన చేశాడు .
17.288696
78.604046