పుత్రా దశరథస్యేమే రూపయౌవన శాలినః
లోకపాలసమాః సర్వే దేవతుల్య పరాక్రమాః
ఉభయోరపి రాజేంద్ర సంబంధేనానుబధ్యతాం
ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః
విశ్వామిత్ర వచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తదా
జనకః ప్రాంజలిర్వాక్య మువాచ మునిపుంగవౌ
కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుంగవౌ
సదృశం కులసంబంధం యదాజ్ఞాపయథః స్వయం
ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే
పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్న భరతావుభౌ
విశ్వామిత్రుడు ఇంకా ఈవిధంగా పలికాడు : “ఈ దశరథ పుత్రులందరూ రూప యౌవన లావణ్యాలతో శోభిస్తున్నారు . దేవతలతో సమానమైన పరాక్రమం వీరి పరాక్రమం . లోకపాలురు అంటే చంద్రుడు , సూర్యుడు , యముడు , అగ్ని , వాయువు , ఇంద్రుడు ,కుబేరుడు , వరుణుడు . వారొతో సమానులైనవారు ఈ దశరథ రాజ కుమారులు . ఈ వివాహ సంబంధం ఉభయుల కులాలకు సంబంధాన్ని దృఢపరుస్తుంది . ఈ బంధాన్ని తమరు ఆమోదించండి “.
వసిష్ఠుని అనుమతితో విశ్వామిత్రుని నొటినుండి వెడలిన ఈ పలుకులు విని జనక మహారాజు వారిరువురకూ అంజలి ఘటించాడు . వారితో ” మునిపుంగవులైన మీరు మమ్ములను కులసంబంధం చేసుకొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు .ఈ ఆజ్ఞ వలన మా కులం ధన్యమయింది . అలాగే జరుగుతుంది . మీకు శుభమగుగాక . కుశధ్వజుని కుమార్తెలు మాండవీ శ్రుతకీర్తులు భరత శత్రుఘ్నులకు భార్యలయి వారిని సేవిస్తారు .
ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే
పాణీన్ గృహ్ణంతు చత్వారో రాజపుత్రా మహాబలా
ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషినః
వైవాహిక ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః
మహామునీ ! ఒకే సమయంలో , ఒకే దినాన మహా బలశాలులైన నలుగురు రాజపుత్రులూ నలుగురు రాజపుత్రికలను వివాహం చేసుకుంటారు . ప్రజాపతి అయిన భగుడు దేవతగా ఉన్న ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో వివాహం చేసుకోవడం శ్రేష్ఠమని విద్వాంసులు చెబుతారు .
విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో ,మహర్షి విశ్వామిత్రుడు జనకునితో
దాశరథులు నలుగురు కకు
భేశ సమానులు , సుపర్వ విశ్రుత శౌర్యుల్
ధీశబలులు భరతుండును
నీ శత్రుఘ్నుండు నిద్దఱిద్దఱికి సముల్
మేమిచ్చెద మంటివి యం
దేమోనను ఘుశధ్వజుండు నిచ్చుట యుండెన్
మీ మాండవి శ్రుతకీర్తియు
జామలగుట వలయు భరత శత్రుఘ్నులకున్
వెంటనే జనకుడు
విచ్చేయుడు బ్రహ్మర్షులు
పచ్చాకును వక్క గొనుడు – బ్రహ్మర్షులు మే
మిచ్చెదము మాదు కూతుల
గ్రచ్చర ఋషివరుల మాట కాదనగలమే
ఋషుల మాటలకు ఎదురు చెప్పగలనా అంటూ తన ఋషి భక్తిని ప్రకటించుకున్నాడ