తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్సమత్యయుః
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ .
నక్షత్రే దితిదైవత్యే స్వోచ్ఛసంస్థేషు పఞ్చసు
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ
ప్రోచ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం
కౌసల్యాజనయద్రామం సర్వలక్షణసమ్యుతం
విష్ణోరర్థం మహాభాగం పుత్రమైక్ష్వాక వర్ధనం
యజ్ఞం పూర్తి అయినాక ఆరు ఋతువులు వచ్చి వెళ్ళాయి . అంటే పన్నెండు మాసాలు గడిచాయి . తిరిగి వసంతం వెల్లివిరిసింది .
చైత్రమాసాన , కౌసల్యా గర్భాన నవమీ తిథి యందు , అదితి దేవతగా గల నక్షత్రంలో (పునర్వసు నక్షత్రంలో ) ఐదు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండగా , కర్కాటక లగ్నంలో , బృహస్పతి చంద్రునితో ఉదయిస్తూండగా సర్వలోక నమస్కృతుడైన శ్రీమహావిష్ణువు , సర్వ లక్షణ సంపన్నుడై , ఇక్ష్వాకు వంశ వర్ధనుడై జన్మించాడు .
వాల్మీకికి నక్షత్ర , గ్రహ తారా స్థితులను గురించి చక్కని అవగాహన ఉందని పై శ్లోకాలు నిరూపిస్తాయి . అసలు ఇటువంటి గ్రహ సంఘటన నిజంగా సాధ్యమా అనే సందేహం కలిగిన కొందరు ” ప్లానెటోరియం ” అనే సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి పరిశోధనలు చేసారు . వారిలో ప్రథముడు “పుష్కర్ భట్నాగర్ ” అనే రెవెన్యూ శాఖ ఉద్యోగి .కంప్యూటర్ లో ఆతడు వాల్మీకి తన శ్లోకాలలో పొందుపరచిన వివరాలను కంపూటర్లోకెక్కించాడు .
కంప్యూటర్ లెక్క ప్రకారం ఈ గ్రహ సంఘటన జరిగిన తేదీ జనవరి 10 , క్రీస్తు పూర్వం 5114 సంవత్సరం , మధ్యాహ్న సమయం (అభిజిత్ సంజ్ఞాత లగ్నం) .
ప్రస్తుతం మనకందుబాటులో ఉన్న కంప్యూటర్లూ , టెలిస్కోపులూ , ఇతర సాధన సామగ్రీ లే ని కాలంలో నక్షత్రాల గతులను గమనించి మనకందించిన వాల్మీకి ధన్యుడు , అందుకొన్న మనం ఇంకా ధన్యులం .
ఆశ్రిత పారిజాతుడైన శ్రీరామచంద్రుడు సీతమ్మ తో సహా భువిలో అవతరించాడని నమ్మకం కలగాలంటే దిగువనీయబడిన లింక్ లను పరిశీలించండి .
1 . http://bhandarusrinivasarao.blogspot.in/2011/12/blog-post.html
2 . http://www.serveveda.org/iServe.html (Scientific dating of events before 2000 BC )
3 . http://lakdiva.org/aryan/rama.html
4 . http://www.hindunet.org/hindu_history/ancient/ramayan/rama_vartak.html
5 . 1 . http://www.sunday-guardian.com/news/rama-born-on-10-jan-claims-stargazer-body