కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఙశ్చ కృతజ్ఙశ్చ సత్యవాక్యో దృఢవృతః
వాల్మీకి మహర్షి తన అశ్రమానికి విచ్చేసిన నారద మహర్ష్ని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. మహాత్మా ఈ లోకంలో అందరికన్నా గుణవంతుదు,వీర్యవంతుడు,ధర్మాలను చక్కగా ఆకళింపు చేసుకున్నవాడు , ఉత్తమమైన శీలం గలవాడు ,సమర్థుడు, ఇంకో మాటలో చెప్పాలంటే పురుషో త్తముడైన మనిషి ప్రస్తుతం ఎవరైనా ఉన్నాడా.అసూయ లేనివాడూ, క్రోధాన్ని జయించిన వాడూ, సూర్యకిరణాలవంటి కాంతి కలిగినవాడూ, , యుధ్ధం చేసేసమయంలో దేవతలను కూడా భయపెట్టేంత భీకరుడూ అయినవడెవడైనా ఉన్నాడా.