తస్మాత్ప్రవర్త్యతాం యజ్ఞః స శరీరో యథా దివం
గచ్ఛే దిక్ష్వాకు దాయాదో విశ్వామిత్రస్య తేజసా
తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్టత
ఏవ ముక్త్వా మహర్షయశ్చ క్రుస్తాస్తాః క్రియాస్తదా
యాజకశ్చ మహాతేజా విశ్వామిత్రో భవత్కృతౌ
ఋత్విజశ్చాను పూర్వ్యేణ మంత్ర్వన్ మంత్ర కోవిదాః
చక్రుః కర్మాణి సర్వాణి యథాకల్పం యథావిధి
తతః కాలేన మహతా విశ్వామిత్రో మహా తపాః
చకారావాహనం తత్ర భాగార్థం సర్వ దేవతాః
నాభ్యాగమం స్తదాహూతా భాగార్థం సర్వ దేవతాః
తతః క్రోధమావిష్టో విశ్వామిత్రో మహామునిః
స్రువముద్యమ్య సక్రోధ త్రిశంకు మిదమబ్రవీత్
పశ్యమే తపసొ వీర్యం స్వార్జితస్య నరేశ్వర
ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజసా
దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్ఛ నరాధిప
స్వార్జితం కిం చిదప్యస్తి మయ హి తపసః ఫలం
రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ
ఉక్త వాక్యే మునౌ తస్మిన్ సశరీరో నరేశ్వరః
దివం జగామ కాకుత్థ్స మునీనాం పశ్యతాం తదా
త్రిశంకు మహారాజును సశరీరంగా స్వర్గానికి పంపడానికి యాగాన్ని చేయడానికి నిశ్చయించుకున్న మహర్షులు యాగాన్ని మొదలు పెట్టారు . ఇతర కార్యాలను మహర్షులు నిర్వహిస్తుండగా , తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు తానే స్వయంగా యాజకుడయ్యాడు . మంత్రకోవిదులైన ఋత్విక్కులు శాస్త్రం నిర్దేశించిన ప్రకారం మంత్రాలను పఠిస్తూ , క్రమం తప్పకుండా , కల్పంలో చెప్పబడినట్లు యాగాన్ని నిర్వహించారు . ఈ యజ్ఞం చాలా దినాలు సాగింది . పిదప తపోమూర్తి అయిన విశ్వామిత్రుడు దేవతలను వారి వారి యజ్ఞ భాగాలను గ్రహించడానికి రమ్మని ఆహ్వానించాడు . మహర్షి పిలిచినా దేవతలు తమ యజ్ఞ భాగాలను గ్రహించడానికి రాలేదు . మహర్షి కోపోద్రిక్తుడైనాడు .స్రువాన్ని ( హోమసాధనమైన కొయ్యగరిటె ) పైకెత్తి , త్రిశంకు మహారాజుతో ఈ విధంగా పలికాడు .” రాజా ! నా తపః ప్రభావాన్ని నీకు చూపిస్తాను . నా తేజస్సు చేత నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను . సశరీరుడవై ఇతరులెవ్వరికీ సాధ్యం కాని స్వర్గానికి నీవు వెళ్ళు . నేను స్వయంగా సంపాదించిన తపః ఫలితం కొంత ఉన్నది కదా . ఆ తపస్సుకు కల తేజస్సు వలన నీవు స్వర్గానికి వెళ్ళు ” .
విశ్వామిత్రుడు తన తపస్సును ధార పోసిన మరుక్షణం త్రిశంకు మహారాజు , సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు .
Reflection :
శరణన్న మహారాజుకు క్షత్రియ ధర్మానుసారం శరణు ఇచ్చాడు సరణాగత వత్సలుడు కౌశికుడు . శరణు కోరిన వాడి కోరిక తీర్చడం కోసం వలసిన యాగాన్ని తానే యాజకుడై నిర్వహించాడు . దేవతలు నిరసించి ,ఆహుతులను అందుకొని , త్రిశంకు కోరిక తీర్చడానికి రాక పోతే తను కష్టపడి సంపాదించిన తపస్సును వెచ్చించి స్వర్గానికి పంపించాడు తన ఆశ్రితుణ్ణి . ఇదీ శరణాగతున్ని కాపాడే దీక్ష . ఇది మహర్షి వ్యకిత్వంలో ఒక అంశ .
మహర్షి శుశ్రూష చేసిన శ్రీరామ చంద్రుడు గురువు దారిలో ప్రయాణం చేస్తూ “శరణన్న వానికి శరణమీయడం తన వ్రతమని వ్రాక్కుచ్చాడు” . శరణన్న వానికి శరణం ఇవ్వకుండా ఉండనని , ఉండలేనని పలికిన రామచంద్రుని పలుకులు ఆలకించండి . కోరితే అంత తప్పు చేసిన రావణునికే శరణాన్ని ప్రసాదిస్తానన్నాడు, రఘుకుల తిలకుడు రామచంద్రుడు .
సకృదేవ ప్రపన్నాయ తావాస్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ
” అత ఏవ రామాయణం దీర్ఘశరణాగతి రిత్యభి యుక్తైర్యుక్తం ” అని పెద్దల వాక్యం . రామాయణం శరణాగతి కావ్యం . వివరించాలంటే దీర్ఘమైన వ్యాఖ్యానం అవసరమవుతుంది .
కల్పం : వేదానికి ఆరు అంగాలు . అవి వరుసగా”శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము”. ఇందులో కల్పంలో యజ్ఞాలలో జరిపే కార్యాలను వివరిస్తూ సూత్రాలు ఉంటాయి . కల్ప సూత్రాలను
శ్రౌత సూత్రాలు , స్మార్త సూత్రాలు అని రెండు భాగాలుగా విభజించ వచ్చు . శ్రౌత సూత్రాలలో హోమగుండ నిర్మాణం , వాటి సంఖ్య ,వాటి కోలతలు .వాటి నిర్మాణ పద్ధతులు , హోమ ప్రక్రియలు , మొదలగు వాతిని గురించి చెప్పబడ్డాయి .శుల్బ సూత్రాలు కల్ప సూత్రాలలో ఒక భాగం
స్మార్త సూత్రాలలో గృహ్య సూత్రాలు అంటే గృహస్తులకు పనికివచ్చే సూత్రాలు. పెళ్ళి, జననం, నామకరణం వంటి సందర్భాలలో పాటించవలసిన విధానాలు. ఇంటిలో ఏర్పరచే హోమగుండాలు లాంటివి వివరించబడ్డాయి . ధర్మ సూత్రాలలో ఆచారాలు, సామాజిక వ్యవహారాలు వివరించ బడ్డాయి .