ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్రాజా విగతసాధ్వసః
ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవం
భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజః
అత్యద్భుతమచింతంత్యం చ న తర్కితమిదం మయా
జనకానాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా
సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం
“ఫెళ్ళుమని విరిగింది కదా విల్లు . గుండెగుభిల్లు మని మూర్ఛ పోయారు సభాసదులు” .
కొంత సమయం గడిచాక మూర్ఛిల్లిన వారు యథా స్థితికి చేరుకున్నారు .”ప్ర” అంటే ఎక్కువగా లేక మిక్కిలి అని . ఆశ్వస్త మంటే గడ్డ కట్టడం . ప్రత్యాశ్వాసమంటే ఎక్కువగా ఘనీభవించిన స్థితి నుండి తేరుకోవడం . వాక్యజ్ఞుడైన జనకుడు భయాన్ని వీడాడు . ముకుళిత హస్తుడైనాడు . విశ్వామిత్ర మహర్షితో ” భగవన్ ! రాముని పరాక్రమాన్ని స్వయంగా తిలకించాను . అత్యద్భుతమూ , అచింత్యమూ అయిన ధనుర్భంగం ఈ విధంగా సఫల మవుతుందని నేను ఊహించలేదు . జనక కులంలో జన్మించిన జానకి శ్రీరామచంద్రుని భర్తగా పొందగలదు . జనక కులానికి కీర్తి తీసుకొని రాగలదు .
మమ సత్యా ప్ర్తిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక
సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా
భవతోనుమతే బ్రహ్మన్ శ్రీఘ్రం గచ్ఛంతు మంత్రిణః
మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితా రథైః
రాజానం ప్రశ్రితైర్వాక్యై రానయంతు పురం మమ
ప్రదానం వీర్యశుల్కాయాః కథయంతు చ సర్వశః
ముని గుప్తౌ చ కాకుత్థ్సౌ కథయంతు నృపాయవై
ప్రీయమాణం తు రాజానమానయంతు సు శ్రీఘ్రగాః
కౌశికశ్చ తథేత్యాహ రాజా చా భాష్య మంత్రిణః
అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్
యథావృత్తం సమాఖ్యాతు మానేతుం చ నృపం తదా
“సీత వీర్యశుల్క” అని నేను చేసిన ప్రతిజ్ఞ సత్యమైన శుభదినమిది . సీత నా ప్రాణం . ప్రాణంతో సమానురాలైన నా సీతను రామునికి ధారాదత్తం చేస్తాను . మహర్షీ ఆజ్ఞాపించు . తమ ఆనతిని శిరసా వహించి నా మంత్రులు రథాలను అధిరోహించి శ్రీఘ్రంగా అయోధ్యా నగరానికి వెళ్ళగలరు . వీర్యశుల్క అయిన సీతను రాముడు వరించిన వృత్తాంతం , శివ ధనుర్భంగ వృత్తాంతం , నేను రామునికి సీతను ధారాదత్తం చేయడానికి నిర్ణయించిన వృత్తాంతం అంతా దశరథ మహారాజుకు సవినయంగా వివరించి ఆ మహానుభావుని నా నగరానికి ఆహ్వానిన్స్తారు . కాకుత్థ్స వంశానికి చెందిన రామ లక్ష్మణులు విశ్వామిత్రుని సంరక్షణలో సురక్షితంగా ఉన్నారని వారు దశరథ మహారాజుకు విన్నవించి ఆ మహానుభావుని ఆనందింప జేస్తారు . సంతోషించిన దశరథ మహారాజును సాదరంగా ఆహ్వానించి తమ వెంట కొని తెస్తారు “అని మహర్షికి నివేదించాడు .
మహర్షి సరేనన్నాడు . జనక మహారాజు మంత్రులతో , సీతా స్వయంవర వృత్తాంతాన్ని దశరథ మహారాజుతో మనవి చేసి ఆ మహానుభావుని తమతో తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు . ఆజ్ఞలను అణుమాత్రం తప్పకుండా పాటించే ఆ అనుచరులు రథాలనధిరోహించి అయోధ్యకు తరలి వెళ్ళారు .