ఋష్యశృంగ మహర్షి విగ్రహం కిగ్గా శృంగేరీ శారదా పీఠం
శృంగేరి మంగళూరికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్య క్షేత్రం . శృంగేరికి పది కిలోమీటర్ల దూరంలో శృంగగిరి పర్వతాలున్నాయి . ఋష్యశృంగ మహర్షి ఈ పర్వతప్రాంతాలలో జన్మించాడని ప్రజల నమ్మకం .
ఆది శంకరులు సనాతన ధర్మాన్నీ , వేద విద్యనూ వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో భారత దేశం నాలుగు మూలల్లో నాలుగు వేద పీఠాలను స్థాపించారు . వాటిలో మొట్ట మొదటిది శృంగేరీ పీఠం . ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి శివైక్యం చెందిన పుణ్య ప్రదేశంలో నెలకొల్ప బడ్డ పీఠమిది . తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఒక దివ్య జ్యోతి మహర్షి నుండి వెలువడి , అచ్చటి శివలింగంలో కలిసి పోయిందని పురాణ గాథ . ఆ శివలింగం శృంగేరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కిగ్గా గ్రామంలో ఈరోజుకూడా మనం చూడవచ్చు .
స వనే నిత్య సంవృధ్ధో మునిర్వనచరః సదా
నాన్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనాత్
ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః
లోకేషు ప్రతిథం రాజన్ విప్రైశ్చ కతిథం సదా
తస్యైవం వర్తమానస్య కాలః సమభివర్తత
అగ్నిం శూశ్రూషమాణస్య పితరం చ యశస్వినం
భవిష్యత్తులో దశరథమహారాజు ఏ విధంగా పుత్రులను పొందగలడో సనత్కుమారుడు ఇతర ఋషులకు వివరిస్తాడు . అది విన్నాడు సుమంత్రుడు . అదే విషయాన్ని దశరథునికి ఈ విధంగా తెలిపాడు స్వామి భక్తి పరాయణుడైన సుమంత్రుడు .
సనత్కుమార మహర్షి చెప్పిన కథ :
అడవిలో పుట్టి అడవిలో పెరగబోయే ఋష్యశృంగుడుకి తన తండ్రి విభాండకుడు తప్ప ఇతర మానవులతో సంపర్కం ఉండదు . ఋష్యశృంగుడు వ్రతిత్వము , ప్రాజాపత్యము అని రెండు విధాలుగా ఉండే బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు . తండ్రి విభాండకుడిని , వైశ్వానరుడైన అగ్నిని సేవిస్తూ కొద్ది కాలం గడుపుతాడు .
17.288696
78.604046
కాశ్యపస్య తు పుత్రోస్తి విభణ్దక ఇతి శ్రుతః
ఋష్యశృంగ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి
సుమంత్రుడు సనత్కుమార మహర్షి చెప్పిన విషయాన్ని దశరథునికి ఈ విధంగా నివేదించాడు :
కాశ్యప మహర్షి కుమారుడు విభాండకుడు . విభాండక మహర్షికి భవిష్యత్తులో ఋష్యశృంగుడనే పేరు గల పుత్రుడు జనిస్తాడు .
17.288696
78.604046
ఏతచ్ఛ్రుత్వా రహః సూతో రాజానమిదమబ్రవీత్
ఋత్విగ్భిరుపదిష్టోయం పురా వృత్తో మయా శ్రుతః
సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి .
అశ్వమేధ యాగాన్ని చేయడానికి ప్రయత్నాలు చురుకుగా సాగించడానికి , యాగాన్ని నిర్వహించాల్సిన వారందరికీ వారు నిర్వహించవలసిన కార్యాలను తెలిపాడు దశరథహారాజు . ఇదంతా గమనిస్తున్న సుమంత్రుడు (దశరథుని రథ సారథి) దశరథునితో రహస్యంగా “మహారాజా నీవు ఏ విధంగా పుత్రులను పొందగలవో , పూర్వం సనత్కుమార మహర్షి ఋషులతో చెప్పగా నేను విన్నాను ” అని అన్నాడు .
17.288696
78.604046
అష్టమ సర్గ
దశరథమహారాజు సంతానం కావాలని అనుకోవడంతో మొదలవుతుంది ఎనిమిదవ సర్గ . సమస్యను పరిష్కరించడానికి అశ్వమేధ యాగం చేయాలని సంకల్పిస్తాడు. పురోహితులకూ , పెద్దలైన గురువులకూ తన అలోచన చెప్పి వారిని సలహా అడుగుతాడు .వారంతా ఏక కంఠంతో దశరథుని అలోచనను మెచ్చులొని అశ్వమేధ యాగానికి ప్రయత్నాలను మొదలు పెట్టమని సలహా ఇస్తారు . అశ్వమేధం చేయడం సులభం కాదనీ , ఏవైనా తప్పులు జరిగితే యజమాని నశిస్తాడనీ తన మంత్రులకు తెలిపి , శ్రధ్ధగా యాగానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చమంటాడు మహారాజు . రాజాజ్ఞను తమ శక్తి సామర్థ్యాలకొద్దీ పాలిస్తామని మాట ఇస్తారు మంత్రిపుంగవులు . దశరథుడు తన దేవేరులను కూడా యాగ దీక్ష వహించమంటాడు . సంతోషంతో సమ్మతిస్తారు దశరథ పత్నులు . దీనితో సమాప్తమవుతుంది అష్టమ సర్గ .
రాముని ఆవిర్భవానికి నాంది పలికింది అష్టమ సర్గలో . హిందువుల ధర్మం ప్రకారం సంసారం చేయడం సంతానం కోసమే . సంతానం లేకపొతే కలిగే బాధను చక్కగా చెప్పాడు వా ల్మీకి . సంతానం లేకపొతే దుఃఖిస్తూ కూర్చోకుండా సంతానం పొందే మార్గాలను అన్వేషించాలి . పురాణ కాలంలో యజ్ఞ యాగాల వల్ల అభీష్టాలు సిధ్ధించేవి . అందుకే అశ్వమేధం చేయాలనే కోరిక కలిగింది దశరథునికి . తను అనుకున్నది సరియైనదా , కాదా అనే సందేహాన్ని గురువులనడిగి , సరియైనదేనని నిర్ణయించుకున్నాడు. అశ్వమేధ యాగాన్ని చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు . సరయూ నదీ తీరం యజ్ఞానికి అనువైన స్థలంగా నిర్ణయింప బడ్డది . భార్యలకు యజ్ఞం చేస్తున్నానని చెప్పగానే వారి ముఖాలు హేమంత కాలంలో మంచు తొలగిన పద్మాలు ప్రకాశించి నట్లు ప్రకాశించినవట .పుత్రుడు జనిస్తాడంటే సంతోషం కలగని దెవ్వరికి ?
17.288696
78.604046
తథా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్ధయంతో ద్విజోత్తమ
అనుజ్ఞాతాస్తతస్సర్వే పునర్జగ్ముర్యథాగతం
విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివానిదమబ్రవీత్
ఋత్విగ్భిరుపదిష్టోయం యథావత్క్ర తురాప్యతాం
దశరథుని ఉత్సాహాన్నిరెట్టించిన పిదప , రాజానుమతితో తమ తమ ప్రదేశాలకు తిరిగి వెళ్ళారు ద్విజులు . ఋత్విక్కులు చెప్పిన విధంగా యాగాన్ని నిర్విఘ్నంగా చేయడానికి ప్రయత్నాలను కొనసాగించమని మంత్రులకు చెప్పి వారిని కార్య నిర్వహణకోసం పంపించాడు అయోధ్యాధిపతి .
ఇత్యుక్తా నృపశార్దూలః సచివాన్ సముపస్థితాన్
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః
తతః స గత్వా తాః పత్నీర్నరేంద్రో హృదయప్రియాః
ఉవాచ దీక్షాం విశత యక్ష్యేహం సుత కారణాత్
తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసాం
ముఖపద్మాన్య శోభంత పద్మానీవ హిమాత్యయే
ద్విజులూ మంత్రులూ నిష్క్రమించాక దశరథుడు తన ధర్మపత్నుల వద్దకు వెళ్ళి ” పుత్రుల కోసం నేను యాగం చేయుచున్నాను , మీరు కూడా దీక్ష వహించండి” , అని చెప్పాడు . ఆ మాటలు ఆలకించిన దశరథ పత్నుల ముఖపద్మాలు ” హేమంత ఋతువులో మంచు తొలగిన పద్మాలు ప్రకాశించిన విధంగా ప్రకాశించాయట .
17.288696
78.604046
తద్యధా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహః
తథేతి చాబ్రువన్ సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్
పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్యతే
అందువలన శ్రధ్ధతో శాస్త్రవిహితంగా ఈ అశ్వమేధ యజ్ఞాన్ని జరిపించండి . తలపెట్టిన కార్యాలను సాధించడంలో మీరందరూ సమర్థులే కదా అని పలికాడు దశరథ మహారాజు . ఆజ్ఞ్య శిరసా వహిస్తామని మాట ఇచ్చారు మంత్రులు
దశరథుడు తన మంత్రులకు అశ్వమేధయాగం చేయడానికి కారణం తెలిపాడు . స శాస్త్రీయంగా చేయడం ఎందుకు ముఖ్యమో తెలిపాడు . ఒక వేళ ఏదైనా లోపం జరుగుతే తనకది ప్రాణాంతకమౌతుందని తెలిపాడు . చివరగా వారి సామర్థ్యం మీద తనకున్న అపారమైన నమ్మకాన్ని వ్యక్త పరిచాడు .
ఒక నాయకుడు పనిని సాధించాల్సిన విధానం ఇది . తన కేమి కావాలో తనకు స్పష్టంగా తెలిసి ఉండాలి ( clarity of thought ) , ఏ పని ఎవ్వరు చేయగలరో నిర్ణయించుకోవాలి ( choosing right man for the right job ) చేయదలచుకున్న దానిని చేసే వారికి ఏమాత్రం సందేహం లేకుండా చెప్పాలి ( unambiguous communication ) , పని చేసే వారి ఉత్సాహాన్ని పెంచాలి (Motivation) — ఇవన్నీ ఒక కార్యం సాధించాలంటే అవసరమైన నాయక లక్షణాలు .
17.288696
78.604046
శక్యః ప్రాప్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే
ఛిద్రం హి మృగయంతేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః
నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి .
ఈ అశ్వమేధ యాగం సులభమైనది కాదు . యే విధమైన అపచారం కలగకుండా ,సులభంగా చేయగలిగినదైతే అందరు రాజులూ దీనిని చేసి ఉండేవారు . ఒకసారి మొదలు పెట్టాక , యజ్ఞానికి భంగం కలుగుతే యజ్ఞం చేసే యజమాని నశిస్తాడు .
17.288696
78.604046
సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞ భూమిర్విధీయతాం
శాంతయశ్చాభివర్ధనాం యథాకల్పం యథావిధి
సరయూనదీ తీరంలో యాగ భూమిని సిధ్ధం చేయమన్నాడు . శాస్త్రోక్తంగా శాంతి కార్యాలను జరపమన్నాడు .
ఏ పుణ్య కార్యాన్నైనా జరపడానికి ముందు శాంతి మంత్రాలు చదవడం ఆనవాయితీ . ఈ కాలంలో కూడా వివాహాది శుభకార్యాలలో మనమీ పధ్ధతులను పాటిస్తున్నాం . ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః అనే పదాలు ప్రతి వేద పాఠం చివరన వినిపిస్తాయి . మన పూర్వీకులు శాంతికి యెంత ప్రాధాన్యత ఇచ్చేవారో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు . భారత దేశ సంస్కారానికీ , సంస్కృతికీ , మనోభావనలకూ ఈ పధ్ధతులు ఒక మచ్చు తునక .
17.288696
78.604046
సంభారాః సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ
సమర్థాధిష్టితశ్చాశ్వస్సోపాధ్యాయో విముచ్యతాం
తాను అనుకున్నదానికి పెద్దల ప్రోత్సాహం రావడంతో అశ్వమేధ యజ్ఞ్యానికి కావలసిన పదార్థాలను సమకూర్చమని తన మంత్రులను
ఆదేశించాడు . జైత్ర యాత్ర సాగించడానికి అశ్వాన్ని వదలమన్నాడు . అశ్వాన్ని రక్షించడంకోసం సమర్థులైన వారిని వెంట పంపించమన్నాడు .
17.288696
78.604046
తతః ప్రీతో భవద్రాజా శ్రుత్వా తద్ద్విజ భాషితం
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్ష పర్యాకులేక్షణః
తన అభీష్టానికి పెద్దలు వత్తాసు పలకడంతో దశరథుడు ఆనంద పరవశుడైనాడు .
మనసులో జనించే మధురోహలను పెద్దల ముందుంచి , వారు ఆ ఆలోచనలను బహు బాగు అంటుంటే కలిగే ఆనందం వర్ణించడం కష్టం . దశరథుని విషయంలో అదే విధంగా జరిగిది . ఒక పుణ్య కార్యానికి నాంది అయింది . ఇక్కడ మనం నేర్చుకోవలసినవి విషయాలు .
1 . ఒక సమస్య ఎదురైనప్పుడు స్వంతంగా ఆలోచించి పరిష్కారం వెదుక్కోవడం .
2 . పరిష్కార మార్గాన్ని అనుభవజ్ఞు లైన వారితొ చర్చించడం .
3 . పెద్దలైన వారు ఆలోచించి పరిష్కారమార్గం సరైన దయితే దానికి తమ సమ్మతి తెలుపడం , ప్రోత్సహించడం .
4 . అనుకున్న కార్యాన్ని సమయం వ్యర్థం చేయకుండా మొదలు పెట్టడం .
స్వయంగా అలోచించ గలగడం చాలా ముఖ్యం , పెద్దలతో సాధ్యాసాధ్యాలను , ఇతర విషయాలనూ కూలంకషంగా చర్చించడం , ఒక నిర్ణయానికి వచ్చినాక దానిని అమలు పరచడం — ఇదీ పనిమంతుడి లక్షణం .
17.288696
78.604046