గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయః
మంత్రగ్రామం గృహాణ త్వం బలామతిబలాం తథా
వత్సా రామా ! ఆచమనం చేయవయ్యా . బల , అతిబల విద్యలను నీ కిస్తాను , పుచ్చుకో మన్నాడు విశ్వామిత్రుడు .
ఏ పని చేసినా దేహాన్నీ , మనస్సునూ పవిత్రంగా ఉన్నప్పుడే చేయాలి . ఆచమనం ఈ పవిత్రతను కలుగజేస్తుంది . వైదిక కర్మలన్నీ ఆచమనం చేసాకే ప్రారంభిస్తారు . ఆచమనం వల్ల ఆరోగ్యం , మనశ్శాంతి కలుగుతాయి .
http://teluguone.com/devotional/content/achamanam-means-107-6330.html లో ఆచమనాన్ని ఎందుకు చేయాలి ? అన్న ప్రశ్నకు సైంటిఫిక్ సమాధానం ఇచ్చారు . మీరూ చదవండి .
” మన గొంతు ముందుభాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంతవరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం V ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.
ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావ వ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.
ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఇలా లోపలినుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్ని నీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.
“కేశవాయ స్వాహా” అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. “నారాయణాయ స్వాహా” అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా “మాధవాయ స్వాహా” అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది.
ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటిద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.
ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పెగులవరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై, లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి “.
Reproduced with thanks from
http://teluguone.com/devotional/content/achamanam-means-107-6330.html .( if there is any objection I may please be informed , the contents will be immediately removed ).
ఆచమనంలో భగవంతుని నామాలు స్మరించడం వల్ల మనస్సుకు పవిత్రత ఏర్పడుతుంది . దృష్టి బాహ్య ప్రపంచ విషయాలవైపు మళ్ళకుండా , ఏకాగ్రత ఏర్పడుతుంది . నేర్చుకునే విద్య స్థిరంగా నాలుగు కాలాలపాటు మదిలో ఉండిపోతుంది . ఏ పని చేసినా శ్రధ్ధా భక్తులతో చేస్తే ఫలితం లభిస్తుంది .
అందుకే ఏ వైదిక కర్మ అయినా ఆచమనంతో ప్రారంభమవుతుంది . అందుకే మహర్షి విశ్వామిత్రుడు , మంత్రాలను రామునికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాక , ఆచమనం చేయమని ఆదేశిస్తాడు .
17.288696
78.604046