Monthly Archives: సెప్టెంబర్ 2017

రామాయణం

రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్
మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః

ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి
గుణాద్రూప గుణాచ్చాపి ప్రీతిర్భూయోభ్య్వర్ధత

తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే
అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా

తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా
దేవతాభిః సమారూపే సీతా శ్రీరివ రూపిణీ

తయా స రాజర్షిసుతోభిరామయా
సమేయివా నుత్తమ రాజకన్యయా
అతీవ రామః శుశుభే ముదాన్వితో
విభుః శ్రియా విష్ణురివామరేశ్వరః

సీతా రాముల దాంపత్యం కమనీయంగా సాగింది . సీత మదిలో రాముడు , రాముడు హృదిలో సీత . తండ్రి అంగీరించాడు కనుక రామునికి సీతపై బహు ప్రేమ . దీనికి తోడు సీత సద్గుణ రాసి . సాటిలేని సౌందర్యవతి . ఈ కారణాల చేత రామునికి సీతపై ప్రేమ ఇంకా అధికమైంది . సీత హృదయంలో రాముడు రెండింతలుగా తిరుగుతున్నాడు . వారు పరస్పరం సంభాషించుకునే అవసరం కూడా లేదు .  ఒకరి హృదయంలోని భావనలు ఇంకొకరికి అర్థమయ్యేవి . వారి హృదయాలు పరస్పరం సంభాషించుకొనేవి . సౌందర్యంలో దేవతా స్త్రీలతో సమానమైన మైథిలి  లక్ష్మీ దేవికి ప్రతిరూపమే  . అందుకే మాత రూపం లక్ష్మీదేవి రూపమే . లక్ష్మీ దేవి అంత అందంగా ఉన్నదని భావన .

బాలకాండ సమాప్తం

 

రామాయణం

గతేతు భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః
పితరం దేవసంకాశం పూజయామాసతుస్తదా

పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః
చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితానిచ

మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమ యంత్రితః
గురూణాం గురుకార్యాణి కాలే కాలే న్వవైక్షత

ఏవం దశరథః ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తధా
రామస్య శీలవృత్తేన సర్వే విషయ వాసినః

తేషామతియశా లోకే రామః సత్యపరాక్రమః
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః

 

IMG_4788

భరతుడు బయలు దేరి వెళ్ళిన పిదప రాముడు , బలశాలి అయిన అతని తమ్ముడు లక్ష్మణుడు , దేవసమానుడైన తండ్రికి సేవచేస్తూ కాలం గడిపారు . రాజ్యంలోని ప్రజలకు ప్రియమైన కార్యాలను , లాభించే కార్యాలను తండ్రి ఆజ్ఞానుసారంగా చేసారు . నియమ బద్ధుడైన రాముడు తల్లులకు కావలసిన పనులను , గురువులకు చేయవలసిన సేవలను చక్కగా చేసాడు .

రాముని నడవడికను ,శీలాన్ని చూసి దశరథుడు సంతోషంతో పొంగిపోయాడు . నగర ప్రజలు , బ్రాహ్మణులు ఆనందించారు . తన ప్రవర్తనతో సత్య పరాక్రముడు , ఎక్కువగా మంచి గుణాలు కల రాముడు తన ప్రజలకు బ్రహ్మదేవునితో సమానంగా భాసించాడు ( బ్రహ్మ తను పుట్టించిన ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తాడు , కల్పిస్తాడు. ఇది నిజమయిన రాజుకు ఉండవలసిన మొదటి లక్షణం ) .

రామాయణం

కస్య చిత్త్వథ కాలస్య రాజా దశరథః స్సుతం
భరతం కైకేయీ పుత్ర బ్రవీద్రఘునందనః

అయం కేకయ రాజస్య పుత్రో వసతి పుత్రక
త్వాం నేతుమాగతో వీర్గ యథాజిన్మాతులస్తవ

ప్రార్థితస్తేన ధర్మజ్ఞ మిథిలాయామహం తథా
ఋషిమధ్యే తు తస్య త్వం ప్రీతిం కర్తుమిహార్హసి

శ్రుత్వా దశరథస్త్యై తద్భరతః కైకేయీ సుతః
అభివాద్య గురుం రామం పరిష్వజ్య చ లక్ష్మణం
గమనాయాభి చక్రాయ శతృఘ్న సహితస్తదా

అపృచ్ఛ్య పితరం శూరో రామం చక్లిష్టకారిణం
మాతౄశ్చాపి నరశ్రేష్ఠః శతృఘ్నసహితో యయౌ

 

రఘునందనులు తండ్రికి శుశ్రూష చేస్తూ ఉండగా కొంతకాలం గడిచింది . ఒక శుభదినాన దశరథ మహారాజు కైకేయి కుమారుడైన భరతునితో ” నాయనా! కేకయ రాజ కుమారుడు నీకు స్వయానా మేనమామ అయిన యుధాజిత్తు నిన్ను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు . ఓ ధర్మజ్ఞుడా ! మిథిలా నగరంలో ఋషుల మధ్యలో నిన్ను తనతో పంపమని నన్ను ప్రార్థించాడు . ఇప్పుడు అతని వెంట కేకయ రాజ్యానికి వెళ్ళి నీవు నాకు ఆనందాన్ని కలిగించు ” అని పలికాడు .

తండ్రి మాటలు విన్న భరతుడు తండ్రికి , తన ఆన్న అయిన శ్రీరామునికి అభివాదం చేసాడు . లక్ష్మణున్ని ప్రియంగా కౌగిలించుకున్నాడు . శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు . శూరుడు , నరశ్రేష్ఠుడు అయిన భరతుడు , అనాయాసంగా కార్యాలను సాధించే రామచంద్రుని , తన తల్లులనూ అడిగి , వారి అనుమతి గైకొని శత్రుఘ్నునితో సహా కేకయ రాజ్యానికి బయలుదేరి వెళ్ళాడు .

 

రామాయణం

ననంద సజనో రాజా గృహే కామైః సుపూజితః
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ సుమధ్యమా
వధూప్రతిగ్రహే జుక్త్ యాశ్చాన్యా రాజయోషితః

తతస్సీతాం మహాభాగామూర్మిళాం చ యశస్వినీం
కుశధ్వజసుతే చోభే జగృహుర్నృపపత్నయః

మంగళాలంభనైశ్చాపి శోభితాః క్షౌమవాసనః
దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్

సుజనులతో తన గృహానికి వచ్చిన దశరథ మహారాజు జనులందరూ కోరుకునే భొగ్య వస్తువుల చేత పూజింపబడ్డాడు . అనందం పొందాడు . మహారాజు భార్యలు కౌసల్య , సుమిత్ర , కైకేయి ఇతర రాజ వంశాలకు చెందిన స్త్రీలు కొత్త కోడళ్ళను సమాదరంగా గృహంలోకి అహ్వానించారు . మహాభాగ్యవంతురాలైన సీతా దేవి , యశస్విని ఊర్మిళ , కుశధ్వజుని కుమార్తెలు మాండవీ శ్రుతకీర్తులు ఎంతో సంతోషంతో అత్తగారింట అడుగు పెట్టారు . కొత్త కోడళ్ళందరూ పట్టు పుటాలు ధరించి , మంగళ ద్రవ్యాలు శరీరానికి పూతగా ధరించి గృహ దేవతలను పూజించారు .

అభివాద్యాభి వాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా
స్వం స్వం గృహమథాసాద్య కుబేర భవనోపమం

గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా ద్విజోత్తమాన్
రేమిరే ముదితాః సర్వా భర్తృభిః సహితా రహః

అటుపిమ్మట పెద్దలందర్కి నమస్కరించారు కొత్త కోడళ్ళు . కుబేర భవనంతో సరి సమానంగా తులతూగే తమ భవనాలలో నివాసం ఏర్పరుచుకున్నారు . బ్రాహ్మణులకు గోవులను , ధనాన్ని ,ధాన్యాన్ని దానంగా ఇచ్చారు . రహస్య భవనాలలో భర్తలతో కలిసి క్రీడించారు ఆ రాజపుత్రికలు .

కుమారాశ్చ మహాత్మానో వీర్యేణాప్రతిమా భువి
కృతదారాః కృతాస్త్రాశ్చ సధనాః ససుహృజ్జనాః
శుశ్రూష మాణాః పితరం వర్తయంతి నరర్షభాఃDSC02633

భార్యలతో కూడిన పరాక్రమశాలులు , అస్త్రవిద్యలో ఆరితేరిన వారు , ధనంతో తులతూగుతూ మిత్రులతో ఆనందిస్తూ రామ లక్ష్మణ శతృఘ్నులు రాజ్యలక్ష్మిని భోగించ సాగారు . వారు తండ్రికి శుశ్రూష చేస్తూ ఆతడేవిధంగా చెబితే ఆవిధంగా నడుచుకుంటూ ఆతని కనుసన్నలలో ఆనందంగా కాలం గడప సాగారు .