రామాయణం

తత్ర దేవర్షి గంధర్వా వసుధాతల వాసినః
భవాఙ్గ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః
శాపాత్ప్రపతితా యే గగనద్వసుధాతలం
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గత కల్మషాః
ధూతపాపాః పునస్తేవ తోయేనథ సుఖాస్వతా
పునరాకాశమావిశ్య స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే

సహజంగానే  పావనమైనది గంగమ్మ . పరమేశ్వరుని జటల స్పర్శ చేత ఇంకా పునీతమైంది . పవిత్రమైన ఆ జలాల స్పర్శ వలన తమ పాపాలు పోతాయని తెలిసిన దేవతలు , ఋషులు , గంధర్వులు , వసుధా (భూదేవి ) తలంపై నివసించే వారు ఆ గంగోదకాన్ని స్పృశించారు . శాపవశం చేత స్వర్గం నుండి వసుధపై పడ్డ వారు పవిత్ర ఉదకాలలో స్నానం చేసి తమ పాపాలనుండి విముక్తులైనారు . గంగా నదిలో మునిగిన శాపగ్రస్తులు పాప ప్రక్షాళనం కాగానే  ఆకాశంలో తిరిగి ప్రవేశించి తమ తమ లోకాలకు చేరుకున్నారట .

ముముచే ముదితో లోకస్తేన తోయేన భాస్వతా
కృతాభిషేకో గంగాయాం బభూవ విగతక్లమః

లోకంలోని ప్రజలు స్వచ్ఛమైన గంగోదకాలను దర్శించి ఆనందంతో పొంగిపోయారు . ఆ జలాలలో మునిగి తమ శ్రమ తీర్చుకున్నారు .

ఆలోచన : గంగా నదీ జలాలలో ” మైక్రోఫాంజెస్ ” అనే ఒక రక మైన వైరస్ ఉంటుందట . ఈ వైరస్ హానికరాలైన సూక్ష్మజీవులను మట్టుబెట్టి మనకు అరోగ్యాన్ని ప్రసాదిస్తుందని విజ్ఞాన శాస్త్రం తెలుపుతోంది . కలరా , మలేరియా  లాంటి వంటి వ్యాధులు గంగా నదీ స్నానంతో కుదురుతాయని మన పూర్వీకుల ప్రగాఢ నమ్మకం . అందుకే గంగ నీళ్ళు ఎంతకాలమైనా నిలువ వుంటాయి . ఈ లక్షణం ప్రపంచంలో ఏ నదీ జలాలకూ లేదు . చాలాకాలం నీళ్ళు నిలవ వుంటాయని ఆంగ్లేయులు ఇంగ్లండ్ దేశానికి వెళ్ళే పడవలలో నింపుకొని వెళ్ళేవారట . ఈ మైక్రోఫాంజెస్ సంఖ్య ఈ మధ్యన తక్కువవుతోందని వినికిడి . గంగా నదీ జలాలను స్వచ్ఛంగా ఉంచుకోవలసిన బాధ్యత మనమీద ఉంది .

Ref : 1.http://www.outlookindia.com/article/The-Water-Purifier-Comes-BuiltIn/277357

For those scientifically inclined a number of papers published on this subject are available .

IMG_0241

Post a comment or leave a trackback: Trackback URL.

వ్యాఖ్యానించండి