ద్విజాన్ విత్రాసయన్ ధీమానురసా పాదపాన్ హరన్.
మృగాంశ్చ సుబహూన్నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ
నీలలోహితమాంజిష్ఠపత్రవర్ణైః సితాసితైః.
స్వభావవిహితైశ్చిత్రైర్ధాతుభిః సమలఙ్కృతమ్৷
కామరూపిభిరావిష్టమభీక్ష్ణం సపరిచ్ఛదైః.
యక్ష కిన్నర గన్ధర్వై ర్దేవ కల్పైశ్చ పన్నగైః
సీతను వెదకడానికి సముద్రాన్ని లంఘించడానికి పూనుకున్న హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద అలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేయనారంభించాడు . సింహం లాగా తిరుగుతున్న ఆ ధీమంతుని శరీరాన్ని తాకిన మృగాలు మృతిచెందాయి . వృక్షాలు కూలిపోయాయి .
మహేంద్రపర్వతం ధాతువులకు నిలయం . ఆ ధాతువులు ఆకు పచ్చని రంగుతో కొన్ని ఉంటే పసుపు పచ్చని రంగుతో మరికొన్ని . మిరుమిట్లు గొలిపే నీలపు రాళ్ళు కొన్నైతే ఎరుపు రంగులో మిడిసి పడుతున్నాయి మరికొన్ని . రంగు రంగుల ధాతువులు ప్రసాదించిన ప్రకాశంతో అత్యద్భుతంగా అలరారుతున్నది మహేంద్ర పర్వతం . కామరూపులైన యక్ష ,గంధర్వ కిన్నరులకూ , దేవతా సమానులైన పన్నగులకూ నివాస స్థానం మహేంద్ర పర్వతం .
వివరణ : సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకున్న ఆంజనేయుడు ఆలోచిస్తూ మహేంద్ర పర్వతం మీద తిరుగుతూంటే ఆతని శరీరానికి తగిలి వృక్షాలు కూలిపోయాయి , జంతువులు మృతి చెందాయి , పక్షులు భయంతో ఎగిరిపోయాయి . మనసులో ,మహోన్నతమైన శరీరంతో ఉన్న ఆంజనేయస్వామిని ఊహించుకొని , అత్యద్భుత శరీరంతో ఆ స్వామి అటూ ఇటూ పచార్లు చేస్తుంటే ఆ స్వామి మార్గంలో ఉన్న వస్తువులు ధ్వంసం కావడమూ , ప్రాణులూ మరణించడం సహజమే కదా . . మనం నడుస్తూ ఉంటే మన క్రింద పడి నలిగిపోయిన పిపీలికాల(చీమల) లాగా . అవి మన పాదాల కింద పడి మరణిస్తుంటే మనకు తెలియని విధంగా .
ఈ శ్లోకాలలో రంగు రంగులతో మెరుస్తున్న మహేంద్రపర్వత సౌందర్యాన్నీ , ఆ పర్వతాన్ని ఆసరాగా చేసుకొని నివసిస్తున్న యక్ష ,గంధర్వ ,కిన్నరుల గురించీ క్లుప్తంగా చెప్పడం జరిగింది .