ప్రవిశన్నాశ్రమపదం వ్యరోచత మహామునిః
శశీవ గతనీహారః పునర్వసు సమఞ్చితః
పుణ్యుడు రామచంద్రుడు ముదంతో ఆశ్రమ ప్రవేశం చేసాడు . మహాముని విశ్వామిత్రుడు , మంచు తొలగినపుడు కనిపించే , పునర్వసు నక్షత్రంతో కూడిన చంద్రుని లాగా భాసించాడు .
మంచు తొలగిన సమయంలో మహా శోభాయమానంగా వెలుగుతాడు పునర్వసు నక్షత్రంతో కూడిన చంద్రుడు . అంతకంటే మిరుమిట్ట్లు గొలుపుతూ కనిపించాడు , రామలక్ష్మణులతో సిధ్ధాశ్రమంలోని తన ఆశ్రమప్రవేశం చేసిన మహాముని విశ్వామిత్రుడు — ఆశ్రమవాసుల నేత్రాలకు .
పునర్వసు నక్షత్రం ” జెమిని ” కాన్స్టిలేషన్ ” లో “కాస్టర్ ” , “పొలక్స్ ” అనబడుతూ , ఉజ్వలంగా ప్రకాసించే రెండు తారల సమూహం . వేల సంవత్సరాల క్రితం , లక్ష్మణ రామచంద్రులను ఈ రెండు తారలతో పోల్చడం వాల్మీకి మహర్షి మహర్షి ఖగోళ జ్ఞానానికి తార్కాణం , పృకృతిని నిశితంగా పరిశీలించి , సంపాదించిన జ్ఞానాన్ని అలతి పదాలలో , అందమైన శ్లోక రూపంలో భావితరానికందించిన మహర్షికి కృతజ్ఞతలు .
పునర్వసు నక్షత్రం శ్రీరాముని జన్మ నక్షత్రం . పునర్వసు అంటే పునః ,వసు ( వసించడానికి మళ్ళీ తిరిగి రావడమని ) . అవసరమైనప్పుడు దివి నుండి భువికి రావడం అవతారమూర్తి ( భగవంతుని ) లీలలో ఒక భాగం . ఆతడు లీలామానుష విగ్రహుడు కదా .
17.288696
78.604046
తేనైష పూర్వమాక్రాంత ఆశ్రమః శ్రమనాశనః
మయాపి భక్త్యా తస్యైష వామనస్యోపభుజ్యతే
ఏతమాశ్రమమాయాంతి రాక్షసా విఘ్నకారిణః
అత్రైవ పురుష వ్యాఘ్ర హంతవ్యా దుష్ట చారిణః
అద్య గచ్ఛామహే రామ సిధ్ధాశ్రమమనుత్తమం
తదాశ్రమపదం తాత తవాప్యే తద్యథా మమ .
విశ్వామిత్రుడు రామునికి వామనమూర్తి వృత్తాంతాన్ని తెలిపిన పిదప ” రామా ! శ్రమను ( అలసట , కష్టం ) తొలగించే ఈ ఆశ్రమంలో వామనుడు నివశించేవాడు . ఆ మహనీయుని మీద అపారమైన భక్తి కలిగిన నేను , ప్రస్తుతం ఈ ఆశ్రమంలో నివసిస్తున్నాను . యజ్ఞాలను ధ్వంసం చేసే రాక్షసులు ఈ ఆశ్రమానికే వచ్చి నా యాగాలకు విఘ్నాలను కలిగిస్తున్నారు . నీవు వారిని సంహరించవలసిన స్థలమిదే . నాయనా ! ఈ ఆశ్రమంలో ప్రవేశించు . ఈ ఆశ్రమం నాకెలాగు స్వంతమో నీకూ అలాగే స్వంతం . ( పూర్వం వామనావతారమెత్తినప్పుడు ఈ ఆశ్రమం నీదే కదా ) అని రామునికి తెలిపాడు .
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబువోవునే మధుపములకు ?
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ సనునె తరంగిణులకు ?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు ?
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నీహారములకు ?
నంబుజోదరు దివ్య పాదారవింద , చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి జేర నేర్చు ? వినుత గుణశీల మాటలు వేయు నేల ?
ఈ పద్యం నోటికి రానివాడు తెలుగు వాడే కాదు . పద్యానికి అర్థం చెప్పవలసిన అవసరం ఉంటుందని నాకనిపించడం లేదు . అంతా అవగతమే . ఈ పద్యాన్ని చదివిన వాడి హృదయం భగవంతుడి చరణారవిందాలకు అర్పితమమై పోతుంది . నిజంగానే పోతన చెప్పినట్లు వేరే మాటలెందుకు . మీరుకూడా భగవంతుని భావనలో మత్తులై , చిత్తాన్ని ఆ మహాత్ముని దివ్య పాదారవిందాల వద్దకు చేర్చండి . ధన్యోస్మి .
Will a honey bee enjoying the taste of honey from a hibiscus mandara flower go and taste honey from other flowers ? wIll a swan swaying in the calm , serene and gentle waves of Mandakini river likes to sway on the rough and surging waves of other rivers ? would a Koyel bird busy in enjoying the taste of tender mango leaves likes taste other leaves ? similarly the mind of a devotee which is immersed in the thoughts of God cannot think of worldly things or enjoy the worldly pleasures .
17.288696
78.604046