రామాయణం

తే దేవాః సగంధర్వాః సాసురాః సహపన్నగాః
సంభ్రాంతమనసః సర్వే పితామహముపాగమన్

తే ప్రసాద్య మహాత్మానం విషణ్ణ్వదనాస్తదా
ఊచుః పరమసంత్రస్తాః పితామహ మిదం వచః

భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః
బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసినః

అయం యజ్ఞ్యహవోస్మాకమనేనాశ్వోపనీయతే
ఇతి తే సర్వ భూతాని నిఘ్నంతి సగరాత్మజాః

బాధ భరించలేక గంధర్వులూ , పన్నగులూ ,  దేవతలూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు . పూజించి , విధాత అనుగ్రహం సంపాదించారు . కలత చెందిన వారు కన్నీళ్ళతో ” భగవన్ ! తండ్రి యజ్ఞాశ్వం కొరకు సగర కుమారులు భూమిని త్రవ్వుతున్నారు . ఆ క్రమంలో పాతాళంలో నివసించే ప్రాణులను హింసిస్తున్నారు . కనిపించిన మనుష్యులను ,వీడే మన అశ్వాన్ని అపహరించాడు , అని పలుకుతూ సంహరిస్తున్నారు . మహాత్ములను కూడా వదలడం లేదు ” అని సృష్టికర్తతో మొర పెట్టుకున్నారు .

Post a comment or leave a trackback: Trackback URL.

వ్యాఖ్యానించండి