రామాయణం

తదద్భుత తమం లోకే గంగాపతన ముత్తమం
దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః
సంపతద్భిః సురగణైస్తేషాం చా భరణౌజసా
శతాదిత్య మివాభాతి గగనం గతతోయదం
శింశుమారోరగగణైః మీనైరపి చ చంచలైః
విద్యుద్భిరవ విక్షిప్త మాకాశమ భవత్తదా

దివ్యమైన కాంతులు గగన భాగంలో నింపుతూ తరలి వచ్చారు దేవతలు -గంగావతరణాన్ని చూడడానికి .ఆ దేవతల శరీర కాంతి చేతా , వారు ధరించిన ఆభరణాల కాంతి చేతా ఆ ప్రదేశం శతసూర్య కాంతులతో మెరిసింది . ఆకాశం విద్యుల్లతలతో , జ్యావల్లీ ధ్వనులతో నిండిపోయింది  .
మనో నేత్రంతో చూసి వర్ణిస్తున్నాడు కౌశికుడు . దాన్ని యథాతథంగా మనకందిస్తున్నాడు ప్రాచేతసుడు ( వాల్మీకి ) . ఈ దృశ్యాన్ని ఎందరో కవులు వర్ణించారు . పుణ్యుడు పోతనామాత్యుడు గంగావతరణాన్ని వర్ణించిన వారిలో అగ్రగణ్యుడు . అద్భుతమైన వచన రూపంలో దీనిని మనకందించాడు . అది చదివిన వాడి జన్మ ధన్యం . రండి మనమూ ఆ మహాత్ముడు రచించిన వచనం చదివి ధన్యులమవుదాం .

Post a comment or leave a trackback: Trackback URL.

వ్యాఖ్యానించండి